టీడీపీ సభ్యులు వాకౌట్‌ చేస్తుండగా అడ్డుకున్న మార్షల్స్

ABN , First Publish Date - 2022-03-07T17:02:27+05:30 IST

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ టీడీపీ సభ్యులు సభలో నినాదాలు చేశారు.

టీడీపీ సభ్యులు వాకౌట్‌ చేస్తుండగా అడ్డుకున్న మార్షల్స్

అమరావతి:  ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ టీడీపీ సభ్యులు సభలో నినాదాలు చేశారు. ప్రసంగ ప్రతులను చించివేసి గాల్లోకి విసిరారు. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే సభ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేయబోయారు. అయితే.. గవర్నర్ తిరిగి వెళ్లే దారిలో టీడీపీ ప్రజాప్రతినిధులు వెళ్లనీయకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. మండలికి కూడా వెళ్లకుండా అడ్డుకుంటారా..? అంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మండిపడ్డారు. సభలో మాట్లాడనివ్వడం లేదని.. కనీసం లాబీల్లో కూడా ఉండనివ్వరా అంటూ కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-03-07T17:02:27+05:30 IST