నేడు నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ABN , First Publish Date - 2020-12-03T13:55:01+05:30 IST

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. వరుసగా మూడు రోజుల పాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు.

నేడు నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. వరుసగా మూడు రోజుల పాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. నేడు అసెంబ్లీలో కీలక అంశాలపై చర్చ జరగనుంది. అజెండాలో మొత్తం మూడు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ, అరోగ్యశ్రీపై స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమం, డీబీటీలపై సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. పలు కీలక బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ల్యాండ్ టైటిలింగ్ బిల్లుతో పాటు దిశ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మునిసిపల్ చట్టం, ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది.

Updated Date - 2020-12-03T13:55:01+05:30 IST