AP అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. కాసేపట్లో YS Jagan కీలక ప్రకటన

ABN , First Publish Date - 2021-11-22T19:46:36+05:30 IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి...

AP అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. కాసేపట్లో YS Jagan కీలక ప్రకటన

అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. మూడు రాజధానుల బిల్లలును ప్రభుత్వం వెనక్కి తీసుకున్నాక ఇవాళ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమవుతాయా..? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేయబోయే కీలక ప్రకటన ఏంటి..? మూడు రాజధానులపై న్యాయ చిక్కులను బట్టి మళ్లీ అదే బిల్లునే వేరేలా ప్రవేశపెడతారా..? లేకుంటే మరో కీలక నిర్ణయాన్ని వెల్లడిస్తారా..? అని తెలుగు ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతున్నారు.


మరికాసేపట్లో సీఎం జగన్ ఈ బిల్లులు ఎందుకు వెనక్కి తీసుకున్నారు..? అనే విషయాలపై క్లారిటీగా చెప్పిన తర్వాత కీలక ప్రకటన చేయబోతున్నారు. అసెంబ్లీలో జగన్ ప్రకటన తర్వాత ఆ కేబినెట్ నిర్ణయాన్ని హైకోర్టులో అడ్వకేట్ జనరల్ ప్రవేశపెట్టనున్నారు. అయితే.. జగన్ ప్రకటన ఏంటి..? దానిపై హైకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.


ఇవి కూడా చదవండిImage Caption


Updated Date - 2021-11-22T19:46:36+05:30 IST