సభలోకి సభ్యులు సెల్ ఫోన్లు తీసుకురావొద్దు: స్పీకర్ తమ్మినేని
ABN , First Publish Date - 2021-11-26T19:24:48+05:30 IST
శాసనసభలోకి సభ్యులు సెల్ఫోన్లు తీసుకురావద్దని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం రూలింగ్ ఇచ్చారు.
అమరావతి: శాసనసభలోకి సభ్యులు సెల్ఫోన్లు తీసుకురావద్దని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం రూలింగ్ ఇచ్చారు. భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ను స్మరించుకున్నారు. తర్వాత చేపట్టిన ప్రశ్నోత్తరాల్లో వైఎస్సార్ కాపునేస్తం అంశంపై చర్చ జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాలకు మంత్రులు వెళ్లినందున సంబంధిత ప్రశ్నలు వాయిదా వేస్తున్నట్లు సభాపతి తెలిపారు.