రేపు ఏపీ అసెంబ్లీకి సెలవు

ABN , First Publish Date - 2022-03-08T18:00:16+05:30 IST

గౌతమ్ రెడ్డి మృతికి శాసనసభలో సంతాప తీర్మానంపై సభ్యులు మాట్లాడిన అనంతరం...

రేపు ఏపీ అసెంబ్లీకి సెలవు

అమరావతి: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి శాసనసభలో సంతాప తీర్మానంపై సభ్యులు మాట్లాడిన అనంతరం సభను వాయిదా వేస్తారు. మరుసటి రోజు అంటే బుధవారం యధావిధిగా సభ జరగాలి. అయితే ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఎటువంటి అధికారిక సెలవు లేనప్పటికీ శాసనసభకు సెలవు ఇవ్వడంపై ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. దివంగత గౌతమ్ రెడ్డి గౌరవార్థం సెలవు ప్రకటించామని తెలిపారు.


గతానికి భిన్నంగా తీసుకున్న ఈ నిర్ణయంపై రాజకీయ పక్షాలు విస్మయాన్ని ప్రకటించాయి. దీనిపై చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్సీ సమావేశంలో చర్చ జరిగింది. మంత్రి బొత్స కుమారుడి పెళ్లి రిసెప్షన్ బుధవారం విజయనగరంలో ఉంది. అందుకే సెలవు ప్రకటించారని ఎమ్మెల్యేలు చెప్పారు. నేతల ఇంట్లో పెళ్లిళ్లకు పేరంటాలకు సభను వాయిదా వేయడం ఏంటని వారు ప్రశ్నించారు. ఈ నిర్ణయం సభ, సంప్రదాయాలపైన వైసీపీకి ఉన్న గౌరవాన్ని సూచిస్తోంది. వింతపోకడలతో సభ గౌరవాన్ని ప్రభుత్వం తగ్గిస్తోందని టీడీఎల్సీ విమర్శించింది. 

Updated Date - 2022-03-08T18:00:16+05:30 IST