సభలోకి సభ్యులు సెల్ ఫోన్లతో రాకూడదు: స్పీకర్ తమ్మినేని
ABN , First Publish Date - 2022-03-17T16:40:15+05:30 IST
సభలోకి సభ్యులు సెల్ ఫోన్లతో రాకూడదంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం రూలింగ్ ఇచ్చారు.
అమరావతి: సభలోకి సభ్యులు సెల్ ఫోన్లతో రాకూడదంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం రూలింగ్ ఇచ్చారు. దీనిపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో జరుగుతున్న పరిణామాలను సెల్ ఫోన్తో రికార్డు చేసి మీడియాకు టీడీపీ సభ్యులు చేరవేస్తున్నారనే సమాచారం ఉందని స్పీకర్ అన్నారు. వైసీపీ సభ్యులు కూడా సెల్ ఫోన్లు తీసుకు వస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు అన్నారు. సభలోకి ఎవ్వరూ సెల్ ఫోన్లు తీసుకు రాకూడదని సభాపతి స్పష్టం చేశారు. ఎవరి మనోభవాలు దెబ్బతినకుండా ఉండాలంటే సెల్ ఫోన్లను సభలోకి అనుమతించకపోవడమే సరైన విధానమని స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యానించారు.