ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-11-25T14:36:41+05:30 IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరోరోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరవ రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. నేడు ఏపీ అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమంపై చర్చ నిర్వహించనున్నారు. ఆరోగ్యం, విద్యపై స్వల్పకాలిక చర్చ‌తో పాటు మరో 3 బిల్లులను సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఏపీ మండలిలిలో బీసీ జనగణనపై మంత్రి వేణుగోపాలకృష్ణ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. బీసీ సంక్షేమం, విద్యుత్ సంస్కరణలు, రోడ్లపై స్వల్పకాలిక చర్చ జరుగనుంది. అసెంబ్లీలో ఆమోదించిన 9 బిల్లులను  ప్రభుత్వం మండలిలో ప్రవేశపెట్టనుంది. 

Updated Date - 2021-11-25T14:36:41+05:30 IST