మెరిసిన గుణేశ్వరన్
ABN , First Publish Date - 2021-02-28T09:35:42+05:30 IST
సౌత్జోన్ అథ్లెటిక్స్ చాంపియన్షి్పలో ఆంధ్రప్రదేశ్ యువ అథ్లెట్ సీహెచ్. గుణేశ్వరణ్ కాంస్య పతకంతో మెరిశాడు. కేరళలోని కోజికోడ్లో శనివారం జరిగిన అండర్-14 బాలుర 600 మీటర్ల పరుగును...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): సౌత్జోన్ అథ్లెటిక్స్ చాంపియన్షి్పలో ఆంధ్రప్రదేశ్ యువ అథ్లెట్ సీహెచ్. గుణేశ్వరణ్ కాంస్య పతకంతో మెరిశాడు. కేరళలోని కోజికోడ్లో శనివారం జరిగిన అండర్-14 బాలుర 600 మీటర్ల పరుగును గుణేశ్వరణ్ 1.28 సెకన్ల టైమింగ్తో ముగించి మూడో స్థానంతో కాంస్యం దక్కించుకొన్నాడు. గుణేశ్వరన్ శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల వాస్తవ్యుడు. కాగా, ఇదే టోర్నీలో తెలంగాణ అథ్లెట్లు ప్రణయ్ (లాంగ్జంప్), నందిని (100 మీ. హర్డిల్స్), కీర్తన (2000 మీ. ప) స్వర్ణాలు దక్కించుకోగా.. రజిత (400 మీ.స్ర్పింట్) కాంస్యం పతకం కైవసం చేసుకుంది.