AP: రైతుల మహాపాదయాత్రకు నేడు కూడా విరామం

ABN , First Publish Date - 2021-11-19T13:53:21+05:30 IST

రాజధాని కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు ఈరోజు కూడా విరామం ప్రకటించారు.

AP: రైతుల మహాపాదయాత్రకు నేడు కూడా విరామం

అమరావతి: రాజధాని కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు ఈరోజు కూడా విరామం ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో విరామం ఇవ్వాలని పరిరక్షణ సమితి నిర్ణయించింది. ప్రకాశం జిల్లా గుడ్లూరులోనే ఈరోజు కూడా ఉండాలని నిర్ణయించారు. భారీ వర్షాల కారణంగానే విరామం ప్రకటించామని పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతి రావు పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-19T13:53:21+05:30 IST