AP: మహాపాదయాత్రపై కొనసాగుతున్న పోలీసుల ఆంక్షలు
ABN , First Publish Date - 2021-11-10T14:04:44+05:30 IST
అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్రపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి.
ప్రకాశం: అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్రపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమరావతి జేఏసీ నేతలపై ఇప్పటికే మూడు కేసులు నమోదు అయ్యాయి. పాదయాత్రను ఏపీ పోలీసులు డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తమ ప్రాంతంలో పాదయాత్రను నిలిపివేయాలని కలెక్టర్, ఎస్పీలకు వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే సుధాకర్బాబు, కొండెపి వైసీపీ ఇన్చార్జ్ వెంకయ్య ఈ మేరకు ఫిర్యాదు చేశారు. కాగా తిరుమల చేరే వరకూ పాదయాత్ర ఆపేది లేదరి రాజధాని రైతులు స్పష్టం చేశారు.