రాధాకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ దారుణం: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-12-13T23:27:12+05:30 IST

చిరకాల మిత్రుడిని పరామర్శించిన వేమూరి రాధాకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ దారుణమని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ...

రాధాకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ దారుణం: చంద్రబాబు

అమరావతి: చిరకాల మిత్రుడిని పరామర్శించిన వేమూరి రాధాకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ దారుణమని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె.లక్ష్మీనారాయణను పరామర్శించడానికి వెళ్లిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై ఏపీ సీఐడీ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని చంద్రబాబు ఖండించారు. కక్షసాధింపు కోసమే స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. చెల్లింపులన్నీ ప్రేమ్ చంద్రారెడ్డి ఎండీగా ఉన్నప్పుడే జరిగాయన్నారు. ముందు ప్రశ్నించాల్సింది ప్రేమ్ చంద్రారెడ్డిననని చెప్పారు. ఆయనను ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే స్కిల్ డెవలప్‌మెంట్‌పై కేసు నమోదు చేశారని చంద్రబాబు ఆరోపించారు. 

Updated Date - 2021-12-13T23:27:12+05:30 IST