ఏపీలో రాక్షస ఉన్మాదం పెరిగిపోతోంది: అయ్యన్న
ABN , First Publish Date - 2021-12-14T03:53:11+05:30 IST
ఏపీలో రోజు రోజుకూ రాక్షస ఉన్మాదం పెరిగిపోతోందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై సీఐడీ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యలో..
విశాఖ: ఏపీలో రోజు రోజుకూ రాక్షస ఉన్మాదం పెరిగిపోతోందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై సీఐడీ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ABN ఎండీ వేమూరి రాధాకృష్ణ ఏం తప్పు చేశారని జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అయ్యన్న ప్రశ్నించారు. సీఐడీ సమక్షంలో స్నేహితుడి పలకరింపునకు వెళ్తే ఈ విధంగా కేసు పెట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. ఇందిరాగాంధీ సమయంలో ఇలాంటివి చూశామని గుర్తు చేశారు. ప్రభుత్వ, ప్రజా వ్యతిరేకతపై మాట్లాడుతున్న పత్రికలపై ఎన్నాళ్లు సంకెళ్లు వేస్తారన్నారు. మీడియా కథనాలు తప్పైతే ఖండించు, పొరపాటు ఉంటే సరిదిద్దుకో.. బెదిరించకు అని చెప్పారు. తప్పుడు ఎఫ్ఐఆర్ను వెంటనే విత్డ్రా చేసుకోవాలని అయ్యన్నపాత్రుడు సూచించారు.