జగన్ మూడేళ్ల పాలనపై పులివెందుల ప్రజలు ఏమంటున్నారంటే..!
ABN , First Publish Date - 2022-05-31T00:30:33+05:30 IST
ఏపీ సీఎం జగన్ (Jagan) పాలనకు మూడేళ్లు పూర్తి అయింది. నాలుగో ఏడాది పాలనలోకి జగన్ అడుగుపెడుతున్నారు. అయితే పాలనపై బిన్నాభిప్రాయాలు...
కడప: ఏపీ సీఎం జగన్ (Jagan) పాలనకు మూడేళ్లు పూర్తి అయింది. నాలుగో ఏడాది పాలనలోకి జగన్ అడుగుపెడుతున్నారు. అయితే పాలనపై బిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అన్నాక్యాంటీన్లను రద్దు చేయడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. మూడేళ్లలో విధ్వంసం తప్ప రాష్ట్రాభివృద్ధి చేసిందేమీ లేదని అంటున్నారు. ముఖ్యంగా కడప (Kadapa) జిల్లా పులివెందులలోనూ ఇవే ప్రశ్నలు జనం నుంచి వినిపిస్తున్నాయి. స్టీల్ ఫ్యాక్టరీ (Steel Factory)పై ఇచ్చిన హామీని కూడా జగన్ మర్చిపోయారని చెబుతున్నారు. రాష్ట్రంలో ఉన్న భూములన్నీ తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారని విమర్శిస్తున్నారు. ముస్లిం సోదరులకు కూడా జగన్ చేసిందేమీ లేదని పులివెందుల (Pulivendula) వాసులు చెబుతున్నారు.