48 గంటల్లో జగన్ సమాధానం ఇవ్వకుంటే.. రఘురామ లేఖ
ABN , First Publish Date - 2021-06-13T19:57:00+05:30 IST
ఏపీ సీఎం జగన్కు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. వైసీపీ అధికారిక వెబ్ సైట్లో ఎంపీల జాబితా నుంచి
ఢిల్లీ: ఏపీ సీఎం జగన్కు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. వైసీపీ అధికారిక వెబ్ సైట్లో ఎంపీల జాబితా నుంచి... తన పేరు తొలగించారని లేఖలో పేర్కొన్నారు. వైసీపీ నుంచి తనను బహిష్కరించారా? అని లేఖలో ప్రశ్నించారు. తనని సస్పెండ్ చేస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. సీఎం జగన్ 48 గంటల్లో సమాధానం ఇవ్వకుంటే... తనను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రకటించాలని స్పీకర్ను కోరుతానన్నారు.