దిక్కుమాలిన పార్టీకి అధినేత వైఎస్ జగన్: లోకేశ్

ABN , First Publish Date - 2021-02-28T16:44:34+05:30 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చురకలంటించారు.

దిక్కుమాలిన పార్టీకి అధినేత వైఎస్ జగన్: లోకేశ్

ఇంటర్నెట్ డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చురకలంటించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థుల్లేక తమ పార్టీ వారికి కండువాలు కప్పుతున్నారని ఎద్దేవా చేశారు. ట్విటర్ వేదికగా దిక్కుమాలిన పార్టీకి అధినేత అంటూ తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపించారు.


‘‘వైసీపీ తరుపున మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక టీడీపీ అభ్యర్థులని బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి బులుగు కండువాలు కప్పారు. పలాస, రాయదుర్గంతో పాటు రాష్ట్రమంతా పోటీకి అభ్యర్థులు లేని దిక్కుమాలిన పార్టీ అధినేత జగన్‌కు తాడేపల్లి కొంప గేటు దాటి వస్తే జనం తంతారని భయం. వైసీపీ అభ్యర్ధులకు జనంలోకి వెళ్లి ఓటు అడగాలంటే భయం. పంచాయతీ ఎన్నికలు పీకమీద కత్తి పెట్టి ఏకగ్రీవాలు చేసుకున్నారు. పురపాలక ఎన్నికల్లో గెలిచే టీడీపీ అభ్యర్థుల్ని ముందుగానే పార్టీలో చేర్చుకుంటున్నారు. నువ్వొక నాయకుడివి. నీదొక పార్టీ. అందుకే నిన్ను పిరికివాడు అనేది వైఎస్ జగన్’’ అంటూ తనదైన శైలిలో విమర్శించారు. 



Updated Date - 2021-02-28T16:44:34+05:30 IST