ఏపీలో కొత్తగా 6,617 కరోనా కేసులు నమోదు
ABN , First Publish Date - 2021-06-16T22:20:35+05:30 IST
ఏపీలో కొత్తగా 6,617 కరోనా కేసులు నమోదు
అమరావతి: ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,617 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్తో 57 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 18,26,751కు చేరింది. అలాగే కరోనాతో 12,109 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 71,466 ఉండగా, గత 24 గంటల్లో 10,228 మంది రికవరీ అయ్యారు. చిత్తూరు, గుంటూరులో 9 మంది చొప్పున మృతి చెందారు.