ఏపీలో చాపకింద నీరులా కరోనా.. కొత్తగా 11,766 కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-04-24T01:00:17+05:30 IST

ఏపీలో చాపకింద నీరులా కరోనా.. కొత్తగా 11,766 కేసులు నమోదు

ఏపీలో చాపకింద నీరులా కరోనా.. కొత్తగా 11,766 కేసులు నమోదు

గుంటూరు: ఏపీలో వైరస్ విజృంభిస్తోంది. కరోనా నివారణకు ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజురోజుకూ కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రోజు ఏపీలో కొత్తగా 11,766 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది. కరోనా వల్ల ఇవాళ 38 మంది మృతి చెందినట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు. ఏపీలో 24 గంటల్లో 45,581 మందికి కరోనా టెస్టులు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. కోవిడ్ వల్ల కొత్తగా నెల్లూరు జిల్లాలో ఆరుగురు చెందగా, చిత్తూరు జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందినట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు. కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళంలో నలుగురు చొప్పున చనిపోయారు. విశాఖ జిల్లాలో ముగ్గురు మృతి చెందగా, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Updated Date - 2021-04-24T01:00:17+05:30 IST