వారిపై కఠిన చర్యలు: డీజిపీ గౌతం సవాంగ్

ABN , First Publish Date - 2021-05-09T19:27:54+05:30 IST

ప్రతి ఒక్కరూ సామాజిక దూరం, డబుల్ మాస్క్ లాంటి జాగ్రత్తలు పాటించాలని ఏపీ డీజిపీ గౌతం సవాంగ్ తెలిపారు.

వారిపై కఠిన చర్యలు: డీజిపీ గౌతం సవాంగ్

విజయవాడ: ప్రతి ఒక్కరూ సామాజిక దూరం, డబుల్ మాస్క్ లాంటి జాగ్రత్తలు పాటించాలని ఏపీ డీజిపీ గౌతం సవాంగ్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లో సెల్ఫ్ డిసిప్లీన్ ఉందన్నారు. అందరూ నిత్యవసరాల కోసమే బయటకి రావాలని చెప్పారు. కర్ఫ్యూ ఎలా పాటిస్తున్నారో పరిశీలించామన్నారు. కొన్నిరోజులు ఇలాంటి జాగ్రత్తలు పాటించాలన్నారు. కొన్నిరోజుల్లో కోవిడ్ నుంచీ బయటపడుతామన్నారు. బయటకు వచ్చేవారి వాహనాలపై కఠిన చర్యలుంటాయని డీజిపీ గౌతం సవాంగ్  హెచ్చరించారు.


రాజకీయాలకు ఇది సమయం కాదు..

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నోటీసులు జారీ చేయడంపై డీజీపీ స్పందించారు. రాజకీయాలకు ఇది సమయం కాదన్నారు. రాజకీయ పరమైన వదంతులు ఎవరూ తీసుకు రావద్దని హితవు పలికారు. అందరూ బాధ్యతగా కోవిడ్ నుంచీ బయటపడేందుకు ఒక కుటుంబంగా పని చేయాలని డీజిపీ గౌతం సవాంగ్ తెలిపారు. 

Updated Date - 2021-05-09T19:27:54+05:30 IST