పీఆర్సీ ఇప్పట్లో లేనట్టే: అశోక్బాబు
ABN , First Publish Date - 2021-10-14T04:03:13+05:30 IST
ఎట్టకేలకు ఉద్యోగ సంఘాలకు జగన్ దర్శనం దక్కిందని ఎమ్మెల్సీ అశోక్బాబు ఎద్దేవా చేశారు. ఉద్యోగ సంఘం నేతల చేతగాని..
అమరావతి: ఎట్టకేలకు ఉద్యోగ సంఘాలకు జగన్ దర్శనం దక్కిందని ఎమ్మెల్సీ అశోక్బాబు ఎద్దేవా చేశారు. ఉద్యోగ సంఘం నేతల చేతగాని తనం చూస్తుంటే సిగ్గేస్తుందని ఆయన విమర్శించారు. పీఆర్సీ ఇచ్చే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదన్నారు. మూడేళ్ల తర్వాత కూడా పీఆర్సీపై చర్చిస్తామంటే తలూపిరావడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఉద్యోగ సంఘాలు యాక్షన్లోకి దిగితే ప్రభుత్వమే చర్చలకు పిలుస్తుందని చెప్పారు. మద్యం రేట్లు మాదిరిగానే కరెంట్ చార్జీలు పెంచుతున్నారని అశోక్బాబు పేర్కొన్నారు.