AP ఈసెట్ ఫలితాలు విడుదల
ABN , First Publish Date - 2022-08-10T17:39:40+05:30 IST
ఏపీ ఈసెట్ ఫలితాలు(AP ESET Results) విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి(Hemachandra Reddy) విడుదల చేశారు. ఫలితాల్లో
విజయవాడ: ఏపీ ఈసెట్ ఫలితాలు(AP ESET Results) విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి(Hemachandra Reddy) విడుదల చేశారు. ఫలితాల్లో 92.36 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాల్లో కూడా బాలికలు పై చేయి సాధించారు. బాలురు 91.44 శాతం, బాలికలు 95.68శాతం ఉత్తీర్ణులయ్యారు. జూలై 22న ఆన్లైన్ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు 39 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. 33,657 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఫలితాలను www.cets.apsche.ap. gov.in/ecet వెబ్సైట్లో చూసుకోవచ్చని, ర్యాంక్ కార్డులను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.