వైసీపీ అరాచకాలకు హద్దు లేకుండా పోయింది: చంద్రబాబు
ABN , First Publish Date - 2021-11-09T23:05:53+05:30 IST
వైసీపీ అరాచకాలకు హద్దు లేకుండా పోయిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు, అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని..
అమరావతి: వైసీపీ అరాచకాలకు హద్దు లేకుండా పోయిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం స్థానిక ఎన్నికల్లో వైసీపీ నేతల అక్రమాలపై ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కుప్పంలో కొందరు పోలీసులు, అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. నామినేషన్లు వేయకుండా దారికాచి అడ్డుకున్నారని, ఇష్టానుసారం వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ధ్వజమెత్తారు. కుప్పంలో వైసీపీ నేతలు రౌడీయిజం చేస్తున్నారన్నారు. కుప్పం 14వ వార్డులో బెస్త కులానికి చెందిన వెంకటేష్ నామినేషన్ వేశారని, అయితే ఆయనను బుల్లెట్ బైక్పై వచ్చి ఢీకొట్టి వెళ్లిపోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అందరికీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని సూచించారు. తమపైనే దాడులు చేస్తూ.. తిరిగి కేసులు పెడుతున్నారన్నారు. వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని చంద్రబాబు విమర్శించారు.