కువైత్లో వెంకటేష్ మృతిపై అనుమానాలు.. సమగ్ర విచారణ జరపాలి: చంద్రబాబు
ABN , First Publish Date - 2022-03-21T17:40:17+05:30 IST
కువైట్ జైలులో ఆత్మహత్య చేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వెంకటేష్ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, అతని మృతదేహం ఇంటికి చేరేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మా
ఇండియన్ ఎంబసీకి చంద్రబాబు లేఖ
రాయచోటి, మార్చి 20: కువైట్ జైలులో ఆత్మహత్య చేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వెంకటేష్ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, అతని మృతదేహం ఇంటికి చేరేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారతరాయబార కార్యాలయానికి లేఖ రాసినట్లు టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాస రెడ్డి తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలానికి చెందిన వెంకటేష్ జైలులో మృతి చెందడంపై అనుమానాలు ఉన్నాయన్నారు. దీనిపైన అత్యున్నత స్థాయిలో సమగ్ర విచారణ జరిపించేందుకు భారత రాయబార కార్యాలయం చొరవ చూపాలన్నారు. వెంకటేష్ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి గాజుల ఖాదర్బాషా, లక్కిరెడ్డిపల్లె మండల అధ్యక్షుడు జయరామ్, సీనియర్ నేత రాజు తదితరులు పాల్గొన్నారు.