AP govt: కాసేపట్లో కార్పొరేషన్ల చైర్మన్లను ప్రకటించనున్న ఏపీ సర్కార్

ABN , First Publish Date - 2021-07-17T16:31:48+05:30 IST

ఎమ్యెల్యేలకు ఉన్న కార్పొరేషన్ పదవులను తొలగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

AP govt: కాసేపట్లో కార్పొరేషన్ల చైర్మన్లను ప్రకటించనున్న ఏపీ సర్కార్

అమరావతి: ఎమ్యెల్యేలకు ఉన్న కార్పొరేషన్ పదవులను తొలగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో వివిధ కార్పొరేషన్ల చైర్మన్‌లను హోంమంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు ప్రకటించనున్నారు.  ఇప్పటికే అనేక సార్లు నామినేషన్ పోస్ట్ ల భర్తీ ప్రక్రియ వాయిదా పడింది. 50 శాతం మహిళలకు చోటు విషయంలో సందిగ్ధం ఏర్పడింది. కొందరు తమ భార్యలకు కాకుండా తమకే పదవులు కావాలని పట్టుపట్టడంతో కసరత్తు ఆలస్యమైంది. ఎట్టకేలకు బుజ్జగించి మహిళలకు 50 శాతం కోటాను ప్రభుత్వం కేటాయించింది. 

Updated Date - 2021-07-17T16:31:48+05:30 IST