AP govt: కాసేపట్లో కార్పొరేషన్ల చైర్మన్లను ప్రకటించనున్న ఏపీ సర్కార్
ABN , First Publish Date - 2021-07-17T16:31:48+05:30 IST
ఎమ్యెల్యేలకు ఉన్న కార్పొరేషన్ పదవులను తొలగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
అమరావతి: ఎమ్యెల్యేలకు ఉన్న కార్పొరేషన్ పదవులను తొలగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను హోంమంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు ప్రకటించనున్నారు. ఇప్పటికే అనేక సార్లు నామినేషన్ పోస్ట్ ల భర్తీ ప్రక్రియ వాయిదా పడింది. 50 శాతం మహిళలకు చోటు విషయంలో సందిగ్ధం ఏర్పడింది. కొందరు తమ భార్యలకు కాకుండా తమకే పదవులు కావాలని పట్టుపట్టడంతో కసరత్తు ఆలస్యమైంది. ఎట్టకేలకు బుజ్జగించి మహిళలకు 50 శాతం కోటాను ప్రభుత్వం కేటాయించింది.