Ap Government: మరో రెండు వేల కోట్లు అప్పు
ABN , First Publish Date - 2022-07-27T02:28:27+05:30 IST
ఏపీ ప్రభుత్వం (Ap Government) మరో రెండు వేల కోట్లు అప్పు (bebt) తెచ్చింది. వెయ్యి కోట్ల రూపాయలు 9 సంవత్సరాలకు...
అమరావతి (Amaravathi): ఏపీ ప్రభుత్వం (Ap Government) మరో రెండు వేల కోట్లు అప్పు (bebt) తెచ్చింది. వెయ్యి కోట్ల రూపాయలు 9 సంవత్సరాలకు 7.79 శాతం వడ్డీతో సెక్యూరిటీ బాండ్ల (Security Bonds) వేలం ద్వారా రుణం సమీకరించింది. అంతేకాదు మరో వెయ్యి కోట్లు 15 సంవత్సరాలకు 8.04 శాతం వడ్డీతో రుణం తీసుకుంది. ఎఫ్ఆర్బిఎం(FRBM)లో 25,500 కోట్లకు పరిమితి చేరుకుంది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో కేంద్రం అనుమతించిన పరిమితిలో ఇంకా 2,500 కోట్లకు మాత్రమే అప్పు చేసేందుకు ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మూడు నెలల్లో ప్రభుత్వం రూ. 25,500 కోట్లు సెక్యూరిటీ బాండ్ల ద్వారా రుణం సమీకరించింది. రుణ పరిమితి పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం మళ్లీ ఢిల్లీ (Delhi)లో ప్రయత్నం చేస్తోంది.