గతేడాదిలాగే ఈ ఏడాది మా అకౌంట్లలో సొమ్ము పోయింది: Suryanarayana
ABN , First Publish Date - 2022-06-30T17:49:48+05:30 IST
జీపీఎఫ్ ఖాతాల్లో రూ.800 కోట్లు మాయం అయ్యాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు.
అమరావతి: జీపీఎఫ్ ఖాతాల్లో రూ.800 కోట్లు మాయం అయ్యాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఈ విషయంపై ఆర్థిక శాఖ అధికారులను కలిసి వివరణ కోరామని... అధికారులు ఇచ్చిన వివరణ ఏమాత్రం సంతృప్తి ఇవ్వలేదని తెలిపారు. ఇది క్రిమినల్ చర్యగా తీసుకోవాల్సిన అంశమన్నారు. ఇది తమఅకౌంట్ను అనధికారికంగా హ్యాకింగ్ చేయడమే అని మండిపడ్డారు. ‘‘గతేడాదిలాగే ఈ ఏడాది మా అకౌంట్లలో సొమ్ము పోయింది’’ అని సూర్యనారాయణ తెలిపారు. ఈ విషయంపై మరికాసేపట్లో సీఎస్ సమీర్శర్మను సూర్యనారాయణ కలువనున్నారు.