ఏపీ ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలపై కేంద్రం దృష్టి పెట్టాలి: టీడీపీపీ

ABN , First Publish Date - 2022-01-29T00:10:07+05:30 IST

ఏపీ ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలపై కేంద్రం దృష్టి పెట్టాలని టీడీపీపీ అభిప్రాయపడింది. వైసీపీకి 28 మంది ఎంపీలుండి

ఏపీ ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలపై కేంద్రం దృష్టి పెట్టాలి: టీడీపీపీ

అమరావతి: ఏపీ ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలపై కేంద్రం దృష్టి పెట్టాలని టీడీపీపీ అభిప్రాయపడింది. వైసీపీకి 28 మంది ఎంపీలుండి 32 నెలల్లో ఏపీకి ఏం సాధించారు? అని ప్రశ్నించింది. పాలన అంటే అప్పులు చేయడం, దోచుకోవడం అనట్టుగా మారిందని, ఏపీలో అనేక సమస్యలుంటే.. ఇప్పటికిప్పుడు కొత్త జిల్లాలంటూ వైసీపీ కొత్త డ్రామా మొదలుపెట్టిందని టీడీపీపీ మండిపడింది. ఉద్యోగుల ఆందోళన, ఇతర సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ జిల్లాల విభజన చేస్తున్నారని టీడీపీపీ దుయ్యబట్టింది.

Updated Date - 2022-01-29T00:10:07+05:30 IST