సుప్రీంకు ఏపీ సర్కార్
ABN , First Publish Date - 2021-01-22T08:32:35+05:30 IST
స్థానిక ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రప్రభుత్వం గురువారమే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
న్యూఢిల్లీ, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రప్రభుత్వం గురువారమే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్నందున ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదని పేర్కొన్నట్లు తెలిసింది. దీనిపై ఎస్ఈసీ కూడా అప్రమత్తమైంది. తమ వాదన వినకుండా దీనిపై నిర్ణయం తీసుకోవద్దని కోరుతూ సుప్రీంకోర్టులో కేవియెట్ పిటిషన్ దాఖలు చేసింది.