Supreme court ఆదేశాలను ఉల్లంఘించిన ఏపీ సర్కార్
ABN , First Publish Date - 2022-06-29T19:14:50+05:30 IST
సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఏపీ సర్కార్ రుషికొండలో పనులు మొదలుపెట్టింది.
విశాఖపట్నం: సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఏపీ సర్కార్ రుషికొండలో పనులు మొదలుపెట్టింది. రుషికొండలో పనులకు సంబంధించి ఇప్పటికే దాఖలైన పిటిషన్లపై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు సూచించిన విషయం తెలిసిందే. పాత నిర్మాణాలు ఉన్న చోట నిర్మాణం చేసుకోవచ్చని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఈ పిటిషన్లపై త్వరలో హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈలోపే కొత్తగా కొండను తవ్విన చోట టూరిజం శాఖ నిర్మాణాలను ప్రారంభించింది. నిర్మాణాలకు సంబంధించి ఇప్పటివరకు జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతి పొందలేనట్టు సమాచారం.