ap Vs Ts: భద్రాచలం వరదలో సెంటిమెంట్ బురద పారిస్తున్నదెవరు?

ABN , First Publish Date - 2022-07-21T01:48:16+05:30 IST

పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడం వివాదాస్పదమవుతోంది. ఎత్తు పెంచడం వల్ల గోదావరి వాటర్ బ్యాక్‎కు వస్తుందని...

ap Vs Ts: భద్రాచలం వరదలో సెంటిమెంట్ బురద పారిస్తున్నదెవరు?

అమరావతి/హైదరాబాద్: పోలవరం (Polavaram) ప్రాజెక్టు ఎత్తు పెంచడం వివాదాస్పదమవుతోంది. ఎత్తు పెంచడం వల్ల గోదావరి వాటర్ బ్యాక్ (Godavari Water Back)‎కు వస్తుందని.. దాని వల్ల తమకు నష్టం కలుగుతుందని ఏపీ (Ap)లో కలిపిన విలీన మండలాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాలను తెలంగాణ (Telangana)లో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసే క్రమంలో ఉమ్మడి ఖమ్మం (Kammam) జిల్లాలోని కూనవరం (Kunavaram), కుక్కూనూరు (Kukkunuru), చింతూరు (Chinturu), వేలేరుపాడు (Velerupadu) మండలాలను పూర్తిగా, భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో పాక్షికంగా పోలవరం ముంపు గ్రామాలను ఏపీలో కలిపారు. ఇప్పుడు ఈ మండలాల విలీన అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఏపీ ప్రభుత్వ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వంగా మారుతోంది. ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. 


ఈ నేపథ్యంలో ‘‘భద్రాచలం (Badrachalam) వరదలో సెంటిమెంట్ బురద పారిస్తున్నదెవరు?. ముంపు గ్రామాల వెనక్కి ఇవ్వాలనడం టీఆర్ఎస్ (Trs) కొత్త ఎత్తు కాదా?. వెంటనే ఏపీ మంత్రులు కౌంటర్లివ్వడం మంటలు రేపేందుకేనా?. అయితే ఊళ్లు ఇవ్వాలనే డిమాండ్‌కు హేతుబద్ధత ఉందా?. రాజీనామా జపం చేస్తున్నది బీజేపీ (Bjp)ని ఇరకాటంలో పెట్టడానికేనా..?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు..



Updated Date - 2022-07-21T01:48:16+05:30 IST