ఏపీ గవర్నర్‌కు తీవ్ర అస్వస్థత.. హైదరాబాద్‌లో చికిత్స

ABN , First Publish Date - 2021-11-17T17:45:10+05:30 IST

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఏపీ గవర్నర్‌కు తీవ్ర అస్వస్థత.. హైదరాబాద్‌లో చికిత్స

అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ముందు విజయవాడలోని ఓ ఆస్పత్రిని సంప్రదించగా ఆయనకు కోవిడ్ లక్షణాలు ఉన్నట్లుగా అనుమానించారు. వెంటనే గవర్నర్ వ్యక్తిగత వైద్యులు ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. గవర్నర్‌కు గతంలో ఒకసారి కోవిడ్ సోకినట్లు తెలియవచ్చింది. ఇటీవల కాలంలో ఆయన ఢిల్లీ పర్యటనతోపాటు పలు ప్రాంతాలకు వెళ్లి వచ్చారు. నిన్నటి నుంచి గవర్నర్‌కు కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు భావించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. అయితే ఆయనకు కరోనానా? లేక సాధారణ అస్వస్థత అనేది నిర్ధరాణ కావాల్సి ఉంది.

Updated Date - 2021-11-17T17:45:10+05:30 IST