bishwabhushan Harichandan: శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్

ABN , First Publish Date - 2022-08-17T19:32:35+05:30 IST

రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Vishwabhushan Harichandan) శ్రీకృష్ణ జన్మాష్టమి (srikrishna janmashtami) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

bishwabhushan Harichandan: శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్

విజయవాడ: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (bishwabhushan Harichandan) శ్రీకృష్ణ జన్మాష్టమి (srikrishna janmashtami) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భగవద్గీత ద్వారా శ్రీకృష్ణ భగవానుడు అందించిన శాశ్వతమైన సందేశాన్ని కృష్ణాష్టమి పండుగ మనకు గుర్తు చేస్తుందన్నారు. సామరస్య పూర్వకమైన సమాజ నిర్మాణానికి పునాదిని ధృవీకరిస్తుందన్నారని తెలిపారు. ఈ శుభ సందర్భం శాంతి, ప్రగతి, శ్రేయస్సుకు నాంది కావాలని, రాష్ట్ర ప్రజల మధ్య సోదర, సౌభ్రాతృత్వం, సామరస్య బంధాలను మరింత బలోపేతం చేయాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు.

Updated Date - 2022-08-17T19:32:35+05:30 IST