AP High Court: రాజధాని పిటిషన్లపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2022-07-23T02:51:36+05:30 IST

రాజధాని పిటిషన్లపై ఏపీ హైకోర్టు (AP High Court) త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజధాని పరిధిలో ఇతరులకు

AP High Court: రాజధాని పిటిషన్లపై హైకోర్టులో విచారణ

అమరావతి: రాజధాని పిటిషన్లపై ఏపీ హైకోర్టు (AP High Court) త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజధాని పరిధిలో ఇతరులకు ఇళ్ల పట్టాలివ్వడంపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అమరావతి (Amaravati) మాస్టర్ ప్లాన్‌, భూకేటాయింపుల రూల్స్‌కు వ్యతిరేకంగా ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తారని లాయర్‌ కారుమంచి ఇంద్రనీల్ వాదించారు. రాజధాని వాసులకే ఆ భూములపై హక్కులు ఉంటాయని లాయర్‌ తెలిపారు. రైతులకు ఖరారు చేశాకే మిగతావారి విషయం ఆలోచించాలని వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశామని ఏజీ కోర్టుకు తెలిపారు. కౌంటర్ అఫిడవిట్ అందలేదని పిటిషనర్ తరపు లాయర్లు తెలిపారు. తదుపరి విచారణ ఆగస్టు 29కి హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2022-07-23T02:51:36+05:30 IST