AP High Court: అన్నమయ్య ప్రాజెక్టు వ్యవహారంలో నష్టపరిహారం ఇవ్వకపోవడంపై హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2022-09-28T21:44:50+05:30 IST
అన్నమయ్య ప్రాజెక్టు (Annamayya project) కొట్టుకుపోయిన వ్యవహారంలో ఇళ్లకు, పంటలకు నష్టపరిహారం ఇవ్వకపోవడంపై ...
అమరావతి (Amaravathi): అన్నమయ్య ప్రాజెక్టు (Annamayya project) కొట్టుకుపోయిన వ్యవహారంలో ఇళ్లకు, పంటలకు నష్టపరిహారం ఇవ్వకపోవడంపై బుధవారం హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు (Nagotu Ramesh Naidu) వేసిన పిటిషన్పై న్యాయవాది గోపాలకృష్ణ వాదనలు వినిపించారు. అయితే రైతులకు, మునిగిపోయిన గృహాలకు పరిహారం ఇచ్చామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదని న్యాయవాది గోపాలకృష్ణ పేర్కొంటూ.. రైతులు, ఇళ్ల యజమానుల జాబితాను న్యాయస్థానానికి అందించారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు.. పరిహారంపై పూర్తిస్థాయి ఆఫిడవిట్ వేయాలని న్యాయవాది గోపాలకృష్ణను ఆదేశించింది. అలాగే ప్రభుత్వం కూడా నష్టపరిహార జాబితాను మరోసారి పరిశీలించాలని సూచిస్తూ.. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.