
అమరావతి: ఈ నెల 27న కోర్టుకు హాజరు కావాలిసిందిగా డీజీపీ, హోం సెక్రటరీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ అధికారికి పదోన్నతి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంశంలో కోర్టు ధిక్కారం కింద ఈరోజు హాజరు కావాలని గతంలో కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఎన్నికల విధుల్లో ఉన్నందున హాజరుకాలేమని అధికారులు అఫిడవిట్ దాఖలు చేయగా...దీనిపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చేవరకు అన్నీ వాయిదా వేయాలని సీఎస్ కోరారని...తమరేమో ఎన్నికల విధులంటున్నారు ఎలా సాధ్యమని ధర్మాసనం ప్రశ్నించింది. ఈనెల 27న కోర్టుకు హాజరు కావాలంటూ డీజీపీ, హోంసెక్రటరీకి హైకోర్టు స్పష్టం చేసింది.