శ్రీకాకుళం కలెక్టర్కు ఏపీ హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ
ABN , First Publish Date - 2022-01-08T04:09:38+05:30 IST
శ్రీకాకుళం కలెక్టర్కు ఏపీ హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ
అమరావతి: శ్రీకాకుళం కలెక్టర్కు ఏపీ హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తోటాడలోని తమ 70 సెంట్ల భూమిని నిషేధిత 22ఏ లిస్ట్ నుంచి తొలగించాలని గతంలో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ చెబుతున్న అంశాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలంటూ గతేడాది మే 3న కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏ చర్యలు తీసుకోలేదని కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. నేడు కోర్టుకు హాజరవ్వాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కలెక్టర్ దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్ చట్టానికి అతీతుడు కాదన్న హైకోర్టు, బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 21కి వాయిదా పడింది.