వరసిద్ధుడి సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి
ABN , First Publish Date - 2022-10-07T06:13:48+05:30 IST
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీనివాస్ గురువారం కాణిపాక వరసిద్ధుడిని దర్శించుకున్నారు.
ఐరాల(కాణిపాకం), అక్టోబరు 6: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీనివాస్ గురువారం కాణిపాక వరసిద్ధుడిని దర్శించుకున్నారు. ఏఈవో రవీంద్రబాబు ఆయన్ను ఆహ్వానించి స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. వేదాశీర్వాద మండపంలో ఆశీర్వదించి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు. సూపరింటెండెంట్ కోదండపాణి, ఆలయ ఇన్స్పెక్టర్ రమేష్ పాల్గొన్నారు.