వరసిద్ధుడి సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి
ABN , First Publish Date - 2022-05-20T06:38:37+05:30 IST
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి గురువారం కాణిపాక వినాయక స్వామివారిని దర్శించుకున్నారు.
ఐరాల(కాణిపాకం), మే 19: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి గురువారం కాణిపాక వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి ఆయన్ను ఆహ్వానించి, స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదాశీర్వాద మండపంలో ఆశీర్వదించి, స్వామి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ ఇన్స్పెక్టర్ రమేష్ పాల్గొన్నారు.