రఘురామపై సీఐడీ కేసు... విచారణకు ఏపీ హైకోర్టు అనుమతి
ABN , First Publish Date - 2022-06-29T22:31:10+05:30 IST
ఎంపీ రఘురామపై నమోదైన సీఐడీ కేసులో విచారణకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. తనపై కేసులను కొట్టివేయాలని హైకోర్టులో రఘురామరాజు పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్: ఎంపీ రఘురామపై నమోదైన సీఐడీ కేసులో విచారణకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. తనపై కేసులను కొట్టివేయాలని హైకోర్టులో రఘురామరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఎంపీ రఘురామరాజును రాజద్రోహం నేరం మినహా మిగతా సెక్షన్ల కింద విచారించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్ దిల్కుషా గెస్ట్హౌస్లో లాయర్ సమక్షంలో విచారించాలని ఆదేశించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విచారణ చేయాలని ఆదేశించింది. కేసుకు సంబంధించిన అంశాలు మినహా ఏ ఇతర అంశాలపై పిటిషనర్ను ప్రశ్నించకూడదని హైకోర్టు పేర్కొంది. అలాగే సీఐడీ కార్యాలయాలకు పిలిపించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ అంతా లాయర్ సమక్షంలోనే జరగాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తే బాధ్యులైన పోలీస్ అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని ఏపీ హైకోర్టు పేర్కొంది.