AP High Court: జవహర్‌రెడ్డిపై హైకోర్టు ఫైర్

ABN , First Publish Date - 2022-07-29T00:22:52+05:30 IST

సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిపై ఏపీ హైకోర్టు (AP High Court) ఫైర్ అయింది. కోర్టు ధిక్కరణ కేసులో హాజరుకాకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

AP High Court: జవహర్‌రెడ్డిపై హైకోర్టు ఫైర్

అమరావతి: సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిపై ఏపీ హైకోర్టు (AP High Court) ఫైర్ అయింది. కోర్టు ధిక్కరణ కేసులో హాజరుకాకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు హాజరయ్యేందుకు కూడా సమయం లేదా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. భవిష్యత్‌లో కోర్టు ఆదేశాల అమల్లో విఫలమైతే.. నాన్‌ బెయిలబుల్ వారెంట్ (Non-bailable warrant) జారీ చేస్తామని వ్యాఖ్యానించింది. సమావేశాల పేరుతో విచారణకు ఎలా గైర్హాజరు అవుతారని నిలదీసింది. సీఎం పేషీ నుంచి రోజుకు ఎన్ని గంటలు సమావేశాల్లో పాల్గొంటారో.. వివరాలు తెప్పించమంటారా? హైకోర్టు నిలదీసింది. గాంధీ, తిలక్ వంటి మహోన్నత వ్యక్తుల కంటే మీరేం గొప్పవాళ్లు కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

Updated Date - 2022-07-29T00:22:52+05:30 IST