ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా
ABN , First Publish Date - 2020-07-06T17:31:31+05:30 IST
అమరావతి: ఏపీలో ఈనెల 8వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే.
అమరావతి: ఏపీలో ఈనెల 8వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఆగస్ట్ 15న ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టును సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెల్లరేషన్ కార్డు ఉండి ఇల్లు లేని కుటుంబానికి సెంటు స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రధాన అంశంగా కూడా ఉంది. ఇప్పటికే పలు సంక్షేమపథకాలను ఆయన అమలు చేశారు. ఇక ఈ ఇళ్ల స్థలాల పంపిణీని అమలు చేయాల్సి ఉంది.తన తండ్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా దాదాపు 28 లక్షల మంది పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని భావించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. లబ్ధిదారులను కూడా ఎంపిక చేశారు. అన్ని జిల్లాల్లో ఇళ్ల స్థలాలను కూడా సేకరించారు. అయితే కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే.