సుప్రీంకోర్టు ఆదేశించినా ఎన్నికల విధుల్లో పాల్గొనం: బొప్పరాజు

ABN , First Publish Date - 2021-01-25T02:58:18+05:30 IST

సుప్రీంకోర్టు ఆదేశించినా ఎన్నికల విధుల్లో పాల్గొనమని అమరావతి ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు తేల్చి చెప్పేశారు. రాజ్యాంగం కన్నా తమ ప్రాణాలే..

సుప్రీంకోర్టు ఆదేశించినా ఎన్నికల విధుల్లో పాల్గొనం: బొప్పరాజు

అమరావతి: సుప్రీంకోర్టు ఆదేశించినా ఎన్నికల విధుల్లో పాల్గొనమని అమరావతి ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తేల్చి చెప్పేశారు. రాజ్యాంగం కన్నా తమ ప్రాణాలే ఎక్కువన్నారు. ఎన్నికలపై  నిమ్మగడ్డ రమేష్‌ మొండి పట్టుదలతో వెళ్తున్నారని బొప్పరాజు తెలిపారు. తాము ప్రభుత్వానికి బానిసలం కాదని, తమపై రాజకీయంగా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. చంపేస్తామన్న ఉద్యోగ సంఘ నేతల వ్యాఖ్యల్ని తప్పు పడుతున్నామని చెప్పారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, తనపై అవినీతి కేసులకు రంగం సిద్ధమైందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని బొప్పరాజు స్పష్టం చేశారు. 

Updated Date - 2021-01-25T02:58:18+05:30 IST