ఏపీ మంత్రుల రాజీనామాలు... ముగిసిన కేబినెట్ భేటీ

ABN , First Publish Date - 2022-04-07T22:48:24+05:30 IST

ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఏపీ మంత్రులు రాజీనామా చేశారు. ఈ మేరక గవర్నర్ హరిచందన్‌కు మంత్రులు రాజీనామాలను...

ఏపీ మంత్రుల రాజీనామాలు... ముగిసిన కేబినెట్ భేటీ

అమరావతి: ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఏపీ మంత్రులు రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్ హరిచందన్‌కు మంత్రుల రాజీనామాలను సీఎం జగన్ పంపనున్నారు. ఈ రాత్రికే మంత్రుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించనున్నారు.


ఈ నెల 11న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదిమూలపు సురేశ్‌, సీదిరి అప్పలరాజు,  చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరు జయరాంలు మళ్లీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. తన కేబినెట్ ను విస్తరిస్తానని సీఎం జగన్ అప్పట్లోనే చెప్పారు. ఈ మేరకు తాజాగా తన కొత్త జట్టును ప్రకటించనున్నారు. 



Updated Date - 2022-04-07T22:48:24+05:30 IST