రోజువారి పారిశుధ్య కార్మికులకు రూ.12 వేలు వేతనం ఇవ్వాలి
ABN , First Publish Date - 2021-07-27T03:22:12+05:30 IST
రోజువారి పారిశుధ్య కార్మికులకు రూ.12 వేల జీతం ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎస్.ఆనందరావు, టీ.మాలకొండయ్య పేర్కొన్నారు.
కావలి, జూలై 26: రోజువారి పారిశుధ్య కార్మికులకు రూ.12 వేల జీతం ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎస్.ఆనందరావు, టీ.మాలకొండయ్య పేర్కొన్నారు. ఆ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కమిషనర్ బీ.శివారెడ్డిని కలిసి వినతిపత్రం అందచేశారు. కావలి మున్సిపాలిటీలో డైలీ పారిశుధ్య కార్మికులుగా 100 మంది మూడేళ్ల నుంచి ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్నారని, వీరికి పనికి తగిన జీతాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారన్నారు. ఏళ్లతరబడి పనిచేస్తున్న స్కూల్ స్వీపర్స్కు రూ. 4వేలు ఇస్తున్నారని వారికి కూడా రూ.12 వేలు ఇవ్వాలన్నారు. అవుట్ సోర్సింగ్ కార్మికులను 60 సంవత్సరాల పేరుతో తొలగిస్తున్నవారి పిల్లలను అవుట్ సోర్సింగ్లో నియమించాల్సి ఉన్నా అలా చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. వీటిపై స్పందించి న్యాయం చేయకపోతే దశలవారీగా ఆందోళన చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎస్కే బాబు, తురక శీనయ్య, శివకోటయ్య, పీ. అనిత, బీ. మాలకొండయ్య, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.