గుంటూరు జిల్లా... కత్తులతో పరస్పర దాడులు
ABN , First Publish Date - 2021-06-21T20:51:47+05:30 IST
గుంటూరు జిల్లా... కత్తులతో పరస్పర దాడులు
గుంటూరు: జిల్లాలోని కర్లపాలెం మండలం దమ్మనవారిపాలెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పొలం వివాదంతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పొలం దగ్గర కత్తులతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.