అనుమానస్పద స్ధితిలో ఇంజనీరింగ్ విద్యార్దిని మృతి

ABN , First Publish Date - 2021-07-27T00:20:09+05:30 IST

అనుమానస్పద స్ధితిలో ఇంజనీరింగ్ విద్యార్దిని మృతి

అనుమానస్పద స్ధితిలో ఇంజనీరింగ్ విద్యార్దిని మృతి

విజయవాడ: ప్రేమ మాయలో పడి అనుమానస్పద స్ధితిలో ఇంజనీరింగ్ విద్యార్దిని మృతి చెందింది. విజయవాడ లయోలా కాలేజీలో కుమారి మున్నీ అనే విద్యార్థిని ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న తరుణ్ ప్రేమలో యువతి పడినట్లు సమాచారం. 20 రోజులుగా తరుణ్  మున్నీని తన రూమ్‌లో ఉంచుకున్నాడని తెలిసింది. అయితే అనుమానస్పద స్ధితిలో యువతి మృతి చెందింది. ప్రభుత్వాసుపత్రిలో చేర్చి మాచవరం పోలీసుస్టేషన్‌లో తరుణ్ లొంగిపోయాడు. యువతిని కొట్టి చంపేశాడని మృతురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మృతురాలు మున్నీది పశ్చిమగోదావరి జిల్లా టి. నరసాపురం మండలం తెడ్లం గ్రామం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2021-07-27T00:20:09+05:30 IST