గోరంట్ల మాధవ్ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-08-18T01:20:56+05:30 IST
గోరంట్ల మాధవ్ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు
ఢిల్లీ: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్కు ఏపీ బీజేపీ మహిళా మోర్చా ఫిర్యాదు చేసింది. ఏపీలో మహిళలపై పెరుగుతున్న దాడులు, అత్యాచారాలపై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు ఏపీ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ తెలిపారు. ఏపీకి వచ్చి విచారణ జరపాలని మహిళా కమిషన్ను కోరామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక క్రైమ్ రేటు పెరిగిందన్నారు.