AP News: త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం జగన్
ABN , First Publish Date - 2022-08-15T12:54:33+05:30 IST
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య వేడుకలకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
విజయవాడ (Vijayawada): నగరంలో స్వాతంత్ర్య వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) త్రివర్ణ పతాకాన్ని (Tricolor flag) ఆవిష్కరించనున్నారు. సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు. ప్రదర్శన కోసం వివిధ శాఖల శకటాలను అధికారులు సిద్ధం చేశారు. కాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం 5.30 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ బిశ్విభూషన్ హరిచందన్ (Bishvibhushan Harichandan) తేనేటు విందు ఇవ్వనున్నారు. ఈ ఎట్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరుకానున్నారు.