అవంతి ఇంటి దగ్గర తెలుగు మహిళల ఆందోళన

ABN , First Publish Date - 2022-06-27T00:47:44+05:30 IST

అవంతి ఇంటి దగ్గర తెలుగు మహిళల ఆందోళన

అవంతి ఇంటి దగ్గర తెలుగు మహిళల ఆందోళన

విశాఖ: మాజీమంత్రి అవంతి ఇంటి దగ్గర తెలుగు మహిళల ఆందోళన దిగారు. టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, అనితలపై మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు వ్యాఖలను ఖండిస్తూ ఆందోళన చేస్తున్నారు. అవంతి, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ను అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. చెంగల వెంకట్రావు వ్యాఖ్యలకు పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా అవంతి శ్రీనివాస్ బాధ్యత వహించాలని తెలుగు మహిళలు వాపోతున్నారు. చెంగల వెంకట్రావుతో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. తెలుగు మహిళలు తన ఇంటికి రావడంపై అవంతి అభ్యంతరం వ్యక్తం చేశారు. పరిశీలిస్తానంటూ అవంతి, మాజీ ఎమ్మెల్యే రమేష్ వెళ్లిపోయారు. 

Updated Date - 2022-06-27T00:47:44+05:30 IST