AP News: ఆ వ్యాఖ్యలపై బొత్స సీరియస్
ABN , First Publish Date - 2022-09-25T19:14:28+05:30 IST
విశాఖ: వికేంద్రీకరణ పాలనకు మద్దతుగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. అమరావతి రైతుల యాత్రను తరమికొట్టాలంటూ .. కొంద
విశాఖ: వికేంద్రీకరణ పాలనకు మద్దతుగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. అమరావతి రైతుల యాత్రను తరమికొట్టాలంటూ .. కొందరు చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీరియస్ అయ్యారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతం కలిగేలా మాట్లాడొద్దని హితవు పలికారు. ఒకరి మనోభావాలు దెబ్బతీసే హక్కు మరొకరికి లేదని పేర్కొన్నారు.