ఎన్ఆర్ఐలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
ABN , First Publish Date - 2022-08-16T15:43:37+05:30 IST
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఎన్ఆర్ఐలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్ఆర్ఐలు సంపద సృష్టికర్తలు కావాలని చంద్రబాబు సూచించారు.
అమరావతి: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఎన్ఆర్ఐలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్ఆర్ఐలు సంపద సృష్టికర్తలు కావాలని చంద్రబాబు సూచించారు. విదేశాల్లో భారతీయులు పలు రంగాల్లో ప్రతిభ చాటుతున్నారని కొనియాడారు. పలు దేశాల అభివృద్ధిలో తెలుగు వారి పాత్ర ఎక్కువన్నారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఎన్ఆర్ఐలు కృషి చేయాలన్నారు. తమ అనుభవాలతో తెలుగు వారు మరింత ఉన్నత స్థితికి వెళ్లాలన్నారు. దేశంలో పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని చంద్రబాబు అన్నారు. సొంత గ్రామాల అభివృద్ధికి ఎన్ఆర్ఐలు కృషి చేయాలన్నారు. సూచనలు, సలహాల కోసం టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ పనిచేస్తోందన్నారు.